నాతో రహస్యంగా అవిక బిడ్డను కన్నదనే రూమర్ విని నా భార్య, నేను నవ్వుకున్నాం!
on Jun 23, 2021
టీవీ నటుడు మనీష్ రాయ్సింఘానీ 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ రహస్యంగా బిడ్డను కన్నదనే దుమారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఇద్దరూ కలిసి 'ససురాళ్ సిమర్ కా' అనే సీరియల్లో కలిసి పనిచేశారు. అయితే మనీష్ తనకు మంచి మిత్రుడనీ, తన లైఫ్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందనీ చెప్పిన అవిక, అతనితో బిడ్డను కన్నాననే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చేసింది. పైగా రెండేళ్లుగా తాను హైదరాబాద్కు చెందిన మిళింద్ చంద్వానీతో డేటింగ్లో ఉన్నానని కూడా చెప్పింది.
అవికతో లింకప్ రూమర్ ఎదుర్కొన్న మనీష్ నోరు విప్పాడు. ఆ రూమర్ను అబ్సర్డ్ అంటూ కొట్టేశాడు. ఆ ప్రచారం తమ చెవిన పడగానే తన భార్య సంగీత, తను కలిసి నవ్వుకున్నామని చెప్పారు. అవిక కంటే తాను 18 సంవత్సరాలు పెద్దవాడినని కూడా అతను తెలిపాడు.
"అవికతో నా స్నేహం గురించి నేను విన్న అత్యంత అసంబద్ధమైన విషయాల్లో ఇదొకటి. ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు కాకూడదా? వాళ్లు రిలేషన్షిప్లోనే ఉండాలా? ఇంకో నిజం ఏమిటంటే ఆమె కంటే నేను 18 సంవత్సరాలు పెద్దవాడిని." అని చెప్పాడు మనీష్.
అవిక ఎప్పుడూ తనకు సన్నిహిత స్నేహితురాలని అతను స్పష్టం చేశాడు. "మిళింద్ చంద్వానీతో ఆమె ఇప్పుడు చాలా సంతోషకరమైన అనుబంధంలో ఉంది. నేను పెళ్లి చేసుకొని సంవత్సరం అయిపోయింది. 2020 జూన్లో నా పెళ్లయింది. ఈ రూమర్స్ విని నా భార్య సంగీత, నేను నవ్వుకున్నాం." అని అతను చెప్పాడు.
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో "మనీష్తో డేటింగ్ చేశారా?" అనే ప్రశ్న అవికకు ఎదురైనప్పుడు, "అది ఇంపాసిబుల్. నో వే! మాకు సీక్రెట్ చైల్డ్ ఉందంటూ రాశారు. ఇప్పటికీ మేం చాలా క్లోజ్. నా జీవితంలో ఆయనకు ఎప్పటికీ చోటు ఉంటుంది. పదమూడేళ్ల వయసు నుంచీ ఇప్పటి దాకా నా జర్నీలో నాకు తటస్థపడిన వారిలో మనీష్ అత్యంత సన్నిహితుడు." అని ఆమె చెప్పింది.