2021 సెకండాఫ్.. కృతి శెట్టి హవా!
on Mar 6, 2021
`ఉప్పెన` చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ ని అందుకున్న ఈ క్యూట్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ చిత్రాలే.. `శ్యామ్ సింగ రాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, #RAPO 19.
నేచురల్ స్టార్ నానికి జోడీగా కృతి నటిస్తున్న `శ్యామ్ సింగ రాయ్` శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. టాలెంటెడ్ హీరో సుధీర్ బాబుకి జంటగా మిస్ శెట్టి యాక్ట్ చేస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఇటీవలే పట్టాలెక్కింది. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి రూపొందించనున్న పేరు నిర్ణయించని బైలింగ్వల్ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
కాగా, ఈ మూడు చిత్రాలు కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే తెరపైకి రానున్నాయని టాక్. తక్కువ గ్యాప్ లో రానున్న ఈ మూడు సినిమాలతో కృతి శెట్టి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి. మొత్తమ్మీద.. 2021 ఫస్టాఫ్ లో డెబ్యూ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. సెకండాఫ్ లో ఏకంగా మూడు సినిమాలతో హవా చాటనుండడం విశేషమనే చెప్పాలి.