జాన్వీ కపూర్ గో బ్యాక్!
on Jan 25, 2021
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్కు అనూహ్యమైన ఘటన ఎదురైంది. రైతుల నుంచి "జాన్వీ కపూర్ గో బ్యాక్" అనే నిరసనలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె హీరోయిన్గా నటిస్తోన్న 'గుడ్ లక్ జెర్రీ' మూవీ షూటింగ్ పంజాబ్లోని పాటియాలా ప్రాంతంలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ రైతుల బృందం నుంచి ఆమెకు నిరసనలు ఎదురయ్యాయి. పాటియాలాలోని భూపింద్ర రోడ్లో షూటింగ్ను నిర్వహించడానికి 'గుడ్ లక్ జెర్రీ' యూనిట్ నానా తిప్పలూ పడింది.
ఓ వైపు షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు ఆ లొకేషన్ బయట నుంచి రైతులు "జాన్వీ కపూర్ గో బ్యాక్" అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వారి కేకలు మిన్నుముట్టడం, అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొనేలా కనిపించడంతో చేసేదేమీ లేక, షెడ్యూల్ టైమ్ కంటే ముందుగానే అక్కడ షూటింగ్ని నిలిపివేసింది యూనిట్.
అయితే రైతులు అంతటితో ఆగలేదు. జాన్వీ బస చేసిన హోటల్ ముందు వారు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని, అక్కడ ఎలాంటి గొడవలూ జరగకుండా అడ్డుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది పంజాబ్ వారే కావడం ఇక్కడ గమనార్హం.
నయనతార హీరోయిన్గా నటించగా సూపర్ హిట్టయిన తమిళ చిత్రం 'కొలమావు కోకిల' (2018)కు రీమేక్గా 'గుడ్ లక్ జెర్రీ' రూపొందుతోంది. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్గుప్తా దర్శకుడు.