గంగవ్వ కెప్టెన్ ఎలా అయ్యిందంటే..!
on Sep 26, 2020
బిగ్ బాస్ హౌస్ లో సభ్యుల కదలికలపై ఓ కన్నెసి ఉంచిన కెమెరాలపై గంగవ్వ రెండు కళ్లేసి ఉంచింది. మొదటివారంలోనూ కెమెరాలకు ప్లయింగ్ కిస్ లు ఇస్తూ ఆకట్టుకుంది. శుక్రవారం దివిని కెమెరాల ముందుకు తీసుకుపోయి "నా మనుమరాలు.. రాత్రి కిడ్నాప్ చేశాం. నేనే అన్నం తినిపించి కిడ్నాప్ చేసినం. ఇటు తిరుగూ" అంది. "ఈ కెమెరా బాగాలేదు అవ్వ" అంటూ దివి మరో కెమెరా ముందుకు తీసుకుపోయింది. ఆ కెమెరా కూడా మూవ్ కాలేదు. "నేను నచ్చలేదా?" అంటూ గంగవ్వ చిన్నబుచ్చుకుంది. ఫిజికల్ టాస్క్ సందర్భంగా దివిని కిడ్నాప్ చేసినప్పుడు మనుషుల టీమ్ లో సభ్యులు హౌస్ డోర్ వద్ద ఎలా ప్రవర్తించాలో గంగవ్వ ఇమిటేట్ చేసి చూపిస్తూ పొట్టచెక్కలయ్యేలా ఇంటి సభ్యులను, ప్రేక్షకులను నవ్వించింది.
కెప్టెన్ పోటీలో ఉన్న అభిజిత్, హారిక, అవినాష్, గంగవ్వ రంగునీళ్ళు ఉన్న బౌల్ ను పటుకుని లాస్ లోకి వెళ్లామని చెప్పాడు బిగ్ బాస్. చివరి వరకు ఎవరి బౌల్ లో నీళ్ళు ఉంటే వారే కెప్టెన్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. దాంతో అభిజిత్ బౌల్ లోని నీళ్ళు దివి కింద పోసేసింది. అవినాష్ బౌల్ లోని రంగునీళ్ళు నోయల్, అమ్మ రాజశేఖర్ కలిసి వొలకపోశారు. హారిక ఒకచోట దాగున్నా హారిక చేతిలో ఉన్న రంగునీళ్ళను మోనాల్, నోయల్, సోహైల్ కలిసి కిందపోయేాలా చేశారు. గంగవ్వ బౌల్ లోని నీళ్ళు కిందపడకుండా సుజాత, లాస్య రక్షణగా నిలబడ్డారు.
బజర్ మోగే సమయానికి గంగవ్వ బౌల్ లోని నీళ్ళు ఒక్క చుక్క కూడా కిందపడకపోవడంతో "గంగవ్వ గెలిచింది" అంటూ కేరింతలు వేస్తూ స్పెపులేసిన సభ్యులపై గంగవ్వ రంగునీళ్ళు చల్లి ఆనందాన్ని పెంచారు. "గంగవ్వ మా అవ్వ" అంటూ అమ్మ రాజశేఖర్ గొడుగు పట్టగా, ఇంటి సభ్యులంతా స్పెపులతో హాడావుడి చేస్తూ ఇంటిలోకి వచ్చారు. రాత్రి లాన్ లో కూర్చున్న సభ్యులు ఆటవిడుపుగా అమ్మ రాజశేఖర్ను ఎత్తుకువెళ్లి స్మిమింగ్ ఫూల్ లో పడేశారు. మరికొందరు సభ్యులను కూడా తోసేశారు. దాంతో బిగ్ హౌస్ లో 18వ రోజు కేరింతలతో గడిచిపోయింది.
Also Read