`దృశ్యం 2`.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అదేనా?
on Jul 24, 2021
థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన `నారప్ప`.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో తాజాగా ఓటీటీలో స్ట్రీమ్ అయిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్ లో వీక్షకాదరణ పొందుతోంది. మరీముఖ్యంగా.. `నారప్ప`గా వెంకీ అభినయానికి సగటు ప్రేక్షకులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, సమంత అక్కినేని కూడా చేరిపోయారు.
ఇదిలా ఉంటే.. `నారప్ప` తరువాత వెంకీ నటించిన `దృశ్యం 2` కూడా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9 లేదా సెప్టెంబర్ 10న `దృశ్యం 2`ని స్ట్రీమ్ చేయబోతున్నారట. అంతేకాదు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్ట్రీమ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రచారంలో నిజమెంతో తెలుస్తుంది.
మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2` (మోహన్ లాల్, మీనా).. ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి అమితాదరణ పొందిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఇప్పుడా సినిమాకి రీమేక్ వెర్షన్ అయిన తెలుగు `దృశ్యం 2` కూడా వేరే ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కానుండడం విశేషం. మరి.. `నారప్ప`తో ఇంప్రెస్ చేసిన వెంకీ.. `దృశ్యం 2`తోనూ ఓటీటీలో మరోసారి మెప్పిస్తారేమో చూడాలి.