వన్స్ మోర్.. మెగాస్టార్ డ్యూయెల్ రోల్?
on Jul 25, 2021
`దొంగ మొగుడు`, `రౌడీ అల్లుడు`, `స్నేహం కోసం`, `ఖైదీ నంబర్ 150`.. ఇలా పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరోమారు చిరు డ్యూయెల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `పవర్`, `సర్దార్ గబ్బర్ సింగ్`, `జై లవ కుశ`, `వెంకిమామ` చిత్రాల దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) కాంబినేషన్ లో మెగాస్టార్ ఓ మాస్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
కాగా, ఈ సినిమాలో చిరంజీవి తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారని సమాచారం. ఈ రెండు కూడా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గానే ఉంటాయని టాక్. అదే గనుక నిజమైతే.. దాదాపు పదిహేడేళ్ళ తరువాత మెగాస్టార్ తండ్రీకొడుకులుగా నటించబోయే సినిమా ఇదే అవుతుంది. చివరిసారిగా ఆయన `అందరివాడు` (2005)లో తండ్రీకొడుకులుగా కనిపించారు.
ఇదిలా ఉంటే.. చిరు తాజా చిత్రం `ఆచార్య` తుది దశకు చేరుకుంది. మరోవైపు `లూసిఫర్` రీమేక్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాలు పూర్తిచేశాకే బాబీ డైరెక్టోరియల్, `వేదాళమ్` రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు చిరు.
Also Read