తండ్రయిన ఆర్య.. పండంటి పాపకు జన్మనిచ్చిన సాయేషా!
on Jul 24, 2021
కోలీవుడ్ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ దంపతులకు అమ్మాయి పుట్టింది. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు సాయేషా జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం. ఆర్య, సాయేషా తల్లితండ్రులయిన విషయాన్ని హీరో విశాల్ బ్రేక్ చేశాడు.
"ఈ విషయాన్ని అందరికీ చెప్పడం ఆనందంగా ఉంది. అంకుల్ కావడం గొప్పగా అనిపిస్తోంది. నా బ్రదర్ జమ్మీ (ఆర్య), సాయేషాకు అమ్మాయి పుట్టింది. షూటింగ్ మధ్యలో నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను. ఇన్షా అల్లా... తండ్రిగా కొత్త బాధ్యత చేపట్టిన ఆర్య, అలాగే సాయేషాకు అంతా మంచి జరగాలి" అని విశాల్ ట్వీట్ చేశాడు.
ఆర్య, సాయేషా వివాహం హైదరాబాద్ లో జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం 10 మార్చి 2019న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్య వయసు 40 ఏళ్ళు కాగా, సాయేషాకు 23 ఏళ్ళు. అయితే, వాళ్ళ ప్రేమకు వయసు అడ్డంకి కాలేదు. సాయేషా తెలుగులో అఖిల్ సరసన అఖిల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అజయ్ దేవ్గణ్తో శివాయ్, జయం రవితో వనమగన్, సూర్యతో కాప్పన్ (బందోబస్త్) సినిమాలు చేసింది. గజినీకాంత్ సినిమాలో జంటగా నటించినప్పుడు ఆర్య, సాయేషా ప్రేమలో పడ్డారు.
Also Read