సమ్మర్ రేసులో `పుష్ప: పార్ట్ 2`?
on May 15, 2021
`బాహుబలి` సిరీస్, `ఎన్టీఆర్` బయోపిక్ తరువాత టాలీవుడ్ నుంచి రెండు భాగాలుగా రాబోతున్న సినిమా `పుష్ప`. `బాహుబలి` సిరీస్ తరహాలోనే పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ క్రేజీ వెంచర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తుండగా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. కన్నడ కస్తూరి రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మాలీవుడ్ స్టార్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `పుష్ప` ఫస్ట్ పార్ట్ కి సంబంధించి సింహభాగం చిత్రీకరణ పూర్తి కాగా.. సెకండ్ పార్ట్ కి సంబంధించి కొంతమేర షూటింగ్ జరిగింది. అంతేకాదు.. `పుష్ప`ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సుక్కు అండ్ టీమ్.. సెకండ్ పార్ట్ ని 2022 సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో `పుష్ప` సిరీస్ తయారవుతోంది. ఇప్పటికే విడుదలైన `ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్` వీడియో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read