ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది?.. అదితి రావ్ క్లారిఫికేషన్!
on Oct 21, 2020
విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్' సినిమాలో మొదట హీరోయిన్గా చేయడానికి సంతకం చేసిన అదితి రావ్ హైదరి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ పాత్ర రాశీ ఖన్నాను వరించింది. లేటెస్ట్గా ఆ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు అఫిషియల్గా ప్రకటించింది అదితి రావ్. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. "కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచవ్యాప్తంగా సినీ లోకం గత 6-8 నెలలుగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పనిలేక నటీనటులెవ్వరూ వెయిట్ చేస్తూ ఉండకూడదని నేనుకోరుకుంటున్నాను." అని ఆమె తెలిపింది.
తాను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్లను పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని అదితి రావ్ చెప్పింది. "అలాగే ప్రారంభించని ప్రాజెక్ట్ లు కూడా నా వల్ల ఏమాత్రం ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. అందుకే నేను పని చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం కొన్ని కారణాలను దృష్టిలో ఉంచుకుని, సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన లలిత్ కుమార్ నిర్మాణంలో, విజయ్ సేతుపతి హీరోగా, దర్శకుడు డిల్లీ ప్రసాద్ దర్సకత్వంలో రానున్న ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాను." అని ఆమె వివరణ ఇచ్చింది.
"దర్శకుడు డిల్లీ ప్రసాద్, విజయ్ సేతుపతి, తుగ్లక్ దర్బార్ మొత్తం బృందంకు మంచి జరగాలని.. వారు బాగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశి ఖన్నాకు ఆల్ ది బెస్ట్. త్వరలో ఈ సినిమా ద్వారా మీ అందరినీ థియేటర్లో చూస్తాను." అని చెప్పింది అదితి.
Also Read