`మేజర్`తోనైనా బ్రేక్ పడుతుందా?
on Apr 16, 2021
దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ నటిగా తనదైన ముద్రవేశారు నిన్నటితరం కథానాయిక రేవతి. అభినయానికి ఆస్కారమున్న పాత్రలకు చిరునామాగా నిలిచిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. దాదాపు రెండు దశాబ్దాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నారు. కాగా, త్వరలో విడుదల కానున్న పాన్ - ఇండియా మూవీ `మేజర్`లో అడివి శేష్ కి తల్లిగా దర్శనమివ్వనున్నారామె.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తెలుగునాట రేవతి కథానాయకులకు అమ్మ పాత్రల్లో నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ ని మెప్పించలేకపోయాయి. `ఈశ్వర్` (2002) మొదలుకుని.. `లోఫర్` (2015), `బ్రహ్మోత్సవం` (2016), `యుద్ధం శరణం` (2017) వరకు ఏ సినిమా కూడా ప్రజాదరణ పొందలేకపోవడమే ఇందుకు నిదర్శనం. `ఈశ్వర్`లో ప్రభాస్ కి సవతి తల్లిగా నటించిన రేవతి.. `లోఫర్`లో వరుణ్ తేజ్ కి అమ్మగా కనిపించారు. `బ్రహ్మోత్సవం`లో మహేశ్ బాబుకి తల్లిగా దర్శనమిచ్చారు. ఇక `యుద్ధం శరణం`లో నాగచైతన్యకి అమ్మ అయ్యారు. ఇప్పుడు `మేజర్`లో అడివి శేష్ కి అమ్మగా నటించారు. మరి.. హీరోలకు రేవతి అమ్మగా నటించిన తెలుగు సినిమాలేవీ ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. `మేజర్`తోనైనా ఈ నెగటివ్ సెంటిమెంట్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి. కాగా, జూలై 2న `మేజర్` తెరపైకి రానుంది.