త్వరగా కోలుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఖుష్బూ స్థితిపై ఫ్యాన్స్ మెసేజ్లు
on Oct 7, 2022
ఖుష్బు సుందర్ సినీ నటిగా, రాష్ట్ర బీజేపీ మహిళా నేతగా ఇప్పుడు జబర్దస్త్ జడ్జిగా అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. ఐతే ఖుష్భు ఇటీవల అనారోగ్యం పాలయ్యింది. ఆస్పత్రి బెడ్ మీద.. నీరసంగా.. చేతికిసెలైన్ పెట్టుకుని ఉన్న ఒక ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసేసరికి అభిమానులు కంగారు పడ్డారు. ఐతే అంతా ఒకే అంటూ రిప్లై ఇచ్చింది ఖుష్బూ. ఇక ఈమె కొంతకాలం నుంచి వెయిట్ లాస్ కి బాగా ట్రై చేస్తున్నారు. చాలా సన్నబడ్డాడు కూడా.
ఐతే ఇంతలో ఏమయ్యిందో ఏమో తన ట్విట్టర్లో ‘వెన్నెముక సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరాను. ట్రీట్మెంట్ అయ్యింది, ఇంటికొచ్చాను. ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ పనిలోకి వెళ్తాను. లేటుగా పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించండి.’ అని ట్వీట్ చేశారు ఖుష్బు.
"బరువు తగ్గే ప్రయత్నంలో కొత్త సమస్యలు వస్తున్నాయేమో, జాగ్రత్తగా ఉండండి, త్వరగా కోలుకోండి..హెల్తీగా ఉండండి, గెట్ వెల్ సూన్, మీరు చాలా వీక్ గా ఉన్నారు. చాలా సన్నబడిపోయారు . మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాం" అంటూ అన్ని భాషల్లో కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్.
Also Read