`శాకుంతలం`.. ముహూర్తం ఫిక్స్
on Feb 27, 2021
కథానాయికగా సమంతది 11 ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో విభిన్న భూమికలు పోషించి మెప్పించారామె. త్వరలోనే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఓ పౌరాణిక కథా చిత్రంలో దర్శనమివ్వనున్నారు. ఆ సినిమానే.. `శాకుంతలం`. వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో కావ్య నాయిక శకుంతల పాత్రలో సమంత కనిపించనున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మార్చి 20 నుంచి చిత్రీకరణని ప్రారంభించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసిందట. అలాగే.. కథానుసారం భారీ సెట్స్ కి స్కోప్ ఉన్న మూవీ కావడంతో.. వాటి రూపకల్పనలోనూ యూనిట్ బిజీగా ఉందని సమాచారం.
తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చుతున్నారు. మరి.. `రుద్రమదేవి` వంటి చారిత్రాత్మక చిత్రం తరువాత గుణశేఖర్ నుంచి వస్తున్న ఈ మూవీ.. ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.