సమంత లేటెస్ట్ పిక్స్ వైరల్.. సెలెబ్రిటీస్ తో పార్టీ.. ఆ ఫోటో అర్థమేంటి?
on Sep 20, 2021
హీరోయిన్ సమంత ఇటీవల తరచూ వార్తల్లో నిలోస్తోంది. ఆమె తన భర్త నాగ చైతన్యతో విడిపోనుందంటూ గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను అటు సమంత గానీ, ఇటు చైతన్య గానీ ఖండించకపోవడంతో వాటికి మరింత బలం చేకూరుతుంది. ఇక రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంతను.. ఈ రూమర్స్ గురించి ఒక రిపోర్టర్ అడగగా.. బుద్ధి ఉందా? అంటూ ఫైర్ అయింది. ఇలా ఓ వైపు విడాకుల రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్న ఆమె.. మరోవైపు టూర్స్, పార్టీలు, సోషల్ మీడియాలో పోస్ట్ లతో కూడా వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఒక ఫోటోలో సమంతతో కోలీవుడ్ బ్యూటీస్ ఉండడం విశేషం. త్రిష, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ లతో ఉన్న ఫోటోను సమంత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీరంతా చెన్నైలో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు తన పెట్స్ ఫోటోలు, వీడియో.. అలాగే టూర్ ఫోటోను కూడా సమంత పంచుకుంది. ముఖ్యంగా '365 Days of gratitude' అనే బుక్ ఫోటోను సమంత షేర్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒత్తిడిని తగ్గించుకోవడం, బంధాన్ని బలపరుచుకోవడం, ప్రతిరోజూ హ్యాపీగా ఉండటం కోసం ఈ డైరీ ప్రత్యేక డిజైన్ చేయబడింది. పార్టీ ఫోటోలు, ఈ బుక్ ఫోటోను ఇప్పుడు సమంత షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా తాను ఒత్తిడి నుండి బయటకు వచ్చి.. హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తుందా అనిపిస్తోంది.
కాగా, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న 'కథువాకుల రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మరో సినిమా, వెబ్ సిరీస్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.