డైరెక్టర్ కి సారీ చెప్పిన హీరో రామ్
on Jun 23, 2022
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా 'ది వారియర్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ లింగుస్వామికి ఒక విషయంలో హీరో రామ్ క్షమాపణలు చెప్పాడు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి 'బుల్లెట్' సాంగ్ విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'విజిల్' అనే మరో సాంగ్ ని విడుదల చేశారు. ఈ సాంగ్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే బుధవారం సాయంత్రం ఈ సాంగ్ లాంచ్ వేడుక జరగగా.. తన స్పీచ్ లో దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, జానీ మాస్టర్ ఇలా అందరి గురించి చెప్పిన రామ్.. డైరెక్టర్ గురించి మాట్లాడటం మర్చిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రామ్ ట్విట్టర్ వేదికగా లింగుస్వామికి సారీ చెప్పాడు.
"సినిమాకి ముఖ్యమైన వ్యక్తి, నా వారియర్, నా డైరెక్టర్ లింగుస్వామి గురించి మాట్లాడలేదు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని మీ భుజాలపై మోశారు. ఇప్పటిదాకా నేను పనిచేసిన ఉత్తమ దర్శకుల్లో మీరొకరు. సారీ అండ్ లవ్ యూ సర్" అంటూ రామ్ ట్వీట్ చేశాడు.
రామ్ ట్వీట్ పై లింగుస్వామి స్పందించాడు. "నాతో వర్క్ చేయడాన్ని మీరు ఎంత ఇష్టపడ్డారో నాకు తెలుసు. సినిమా చూశాక మీరు నాకిచ్చిన హగ్ ఇప్పటికీ, ఎప్పటికీ నా హార్ట్ లో నిలిచిపోతుంది. మన ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది" అంటూ రిప్లై ఇచ్చాడు.