రామ్, పూరి.. ఓ పాన్ ఇండియా మూవీ?
on Mar 1, 2021
`ఇస్మార్ట్ శంకర్`తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని అందించారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అంతేకాదు.. తను కూడా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. ఆ తరువాత ఇద్దరు కూడా వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు.
కట్ చేస్తే.. త్వరలోనే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందట. అది కూడా.. ఓ పాన్ ఇండియా వెంచర్ కోసం ఈ `ఇస్మార్ట్` కాంబినేషన్ జట్టుకట్టనుందని టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరలో ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని వినికిడి. త్వరలోనే రామ్, పూరి సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ వస్తుంది.
కాగా, పూరి ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కాంబినేషన్ లో `లైగర్` చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ.. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రామ్ విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ సెట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ మాస్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వెళ్ళనుంది.