ఇండియాలోనే భారీ బడ్జెట్... ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా మొదలైంది
on Jul 24, 2021
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ మాంచి జోరు మీదున్నాడు. జెట్ స్పీడులో సినిమాలను సెట్స్ మీదకు తీసుకువెళ్తున్నాడు. 'రాధే శ్యామ్' షూటింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసిన ప్రభాస్... ఆల్రెడీ 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. లేటెస్టుగా ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేశాడు.
ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీనికి నాగ్ అశ్విన్ దర్శకుడు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని గతంలో దర్శకుడు వెల్లడించారు. నేడు(శనివారం, జూలై 24న) పూజా కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా మొదలైంది. ముహూర్తపు సన్నివేశాల్లో భారతదేశ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ సైతం పాల్గొన్నారు.
పూజ చేయడంతో పాటు ఈ రోజు సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సుమారు వారం రోజులు ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. దీని కోసం స్పెషల్ గా సెట్ వేశారు. ఇందులో ప్రభాస్ సహా అమితాబ్ బచ్చన్ షూటింగ్ చేయనున్నారు. ఇద్దరిపై ఇంపార్టెంట్ సీన్స్ తీయనున్నారు. హీరోయిన్ దీపికా పదుకొనె నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవ్వొచ్చని టాక్. ప్రజెంట్ ఆమె ముంబైలో హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించడానికి వైజయంతి మూవీస్ రెడీ అయ్యింది.
Also Read