నెలకో సినిమాతో మెలోడీబ్రహ్మ!
on Sep 28, 2021
`ఇస్మార్ట్ శంకర్`(2019)తో బౌన్స్ బ్యాక్ అయిన మెలోడీబ్రహ్మ మణిశర్మ.. కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాదిని `జీరో రిలీజెస్ ఇయర్`గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ సంవత్సరం మాత్రం వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంలోగానే.. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన `రెడ్`తో మరోసారి తన మార్క్ చాటారు మణి.
ఆపై స్వల్ప విరామం వచ్చినా.. ఈ ఏడాది సెకండాఫ్ లో మాత్రం నెలకో సినిమాతో పలకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మెలోడీ బ్రహ్మ. ఆ వివరాల్లోకి వెళితే.. జూలైలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమ్ అయిన
`నారప్ప`తో అలరించిన మణిశర్మ.. ఆగస్టులో `శ్రీదేవి సోడా సెంటర్`తో సందడి చేశారు. ఇక సెప్టెంబర్ లో `సీటీమార్`తో ఆకట్టుకున్న మెలోడీబ్రహ్మ.. అక్టోబర్ లో `రిపబ్లిక్`తో మరోమారు పబ్లిక్ లోకి వస్తున్నారు. ఇలా.. వరుసగా నాలుగు నెలల పాటు నెలకో సినిమాతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న మణిశర్మ.. నవంబర్, డిసెంబర్ నెలలోనూ కొత్త సినిమాలతో పలకరించే అవకాశముంది. లాంగ్ గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవితో జట్టుకట్టిన `ఆచార్య` నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ కావొచ్చంటున్నారు. అలాగే, చాలా కాలంగా విడుదలకు నోచుకోని `ఆరడుగుల బుల్లెట్` కూడా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమైంది. మొత్తమ్మీద.. వరుస నెలల్లో పలకరిస్తూ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు ఈ స్టార్ కంపోజర్.
Also Read