వారం వ్యవధిలో 'సురేష్ ప్రొడక్షన్స్' నుంచి రెండు సినిమాలు!
on Aug 17, 2022
వారం వ్యవధిలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'శాకిని డాకిని' చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు నిన్న ప్రకటించిన సురేష్ ప్రొడక్షన్స్ తాజాగా మరో కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించింది.
శ్రీసింహ కోడూరి హీరోగా సతీష్ త్రిపుర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. సురేష్ బాబు, సునీత తాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
'శాకిని డాకిని' చిత్రానికి కూడా సురేష్ బాబు, సునీత తాటి నిర్మాతలు కావడం విశేషం. ఆ చిత్రం విడుదలవుతున్న వారానికే 'దొంగలున్నారు జాగ్రత్త'ను విడుదల చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రెజీనా కాసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'శాకిని డాకిని' చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు.
Also Read