'మెగా' కాంపౌండ్ లోకి 'మంచు' మూవీ!
on Jun 24, 2022
2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మంచు మనోజ్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. నిజానికి 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మనోజ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు రెండేళ్ల క్రితం తాను హీరోగా 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాను ప్రకటించాడు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కానీ ఆ తర్వాత ఏ చప్పుడూ లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా అటక ఎక్కినట్లేనని అంటున్నారు.
శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో 'అహం బ్రహ్మాస్మి' సినిమా చేస్తున్నట్లు 2020 లో ప్రకటించాడు మనోజ్. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాని తానే నిర్మిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఏం జరిగిందో ఏమో గాని ఇప్పుడు ఆ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఆ మూవీ పోస్టర్, అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే 'అహం బ్రహ్మాస్మి' ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో మంచు మనోజ్ చేయాల్సిన సినిమానే మెగా హీరో చేతిలోకి వెళ్ళిందా అనే చర్చలు నడుస్తున్నాయి.
డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కొన్ని కారణాల వల్ల తాను ఈ సినిమా చేయలేనని 'అహం బ్రహ్మాస్మి' ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు అదే కథతో వైష్ణవ్ సినిమా చేస్తున్నాడో లేక కొత్త కథతో చేస్తున్నాడో క్లారిటీ రావాల్సి ఉంది.