శేఖర్ కమ్ములతో సినిమా.. ఎగ్జైటింగ్ గా ఉందంటున్న ధనుష్
on Jun 19, 2021
కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ట్రై లింగువల్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ధనుష్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు.
తను ఆరాధించే డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పనిచేయడం పట్ల ధనుష్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించాడు. తను ఆరాధించే దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నాడు. అలాగే నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మాణంలో కలిసి పనిచేయబోతున్నందుకు తనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని ధనుష్ చెప్పాడు.
మరోవైఫు ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ 'జగమే తంత్రమ్' శుక్రవారం నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే హాలీవుడ్ లో ఓ సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల విషయానికొస్తే నాగచైతన్య-సాయిపల్లవి జంటగా ఆయన తెరకెక్కించిన 'లవ్ స్టొరీ' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read