తారక్కి విలన్ గా అరవింద్ స్వామి?
on May 5, 2021
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన `రోజా`, `బొంబాయి` చిత్రాలతో కథానాయకుడిగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు సీనియర్ హీరో అరవింద్ స్వామి. ఆపై తెలుగులోనూ `మౌనం`లాంటి సినిమాల్లో నేరుగా నటించి అలరించారాయన. కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరమైన ఈ టాలెంటెడ్ యాక్టర్.. మణిరత్నం తెరకెక్కించిన `కడల్` (తెలుగులో `కడలి`)తో రి-ఎంట్రీ ఇచ్చారు. అయితే, ప్రతినాయకుడిగా నటించిన తమిళ చిత్రం `తని ఒరువన్`తోనే మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అదే సినిమాని.. తెలుగులో `ధృవ` పేరుతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేయగా.. అందులోనూ విలన్ గా ఆకట్టుకున్నారు అరవింద్ స్వామి.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరో తెలుగు చిత్రంలో బ్యాడీగా నటించబోతున్నారట మిస్టర్ స్వామి. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా అరవింద్ స్వామిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే `ఎన్టీఆర్ 30`లో అరవింద్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, జూన్ ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న `ఎన్టీఆర్ 30`.. 2022 ఏప్రిల్ 29న థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read