అల్లు అర్జున్ కేసు కొట్టివేత..మొత్తం నడిపింది వాళ్లే
on Nov 6, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి సంబంధించి, నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసిపీ నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు శిల్ప రవిచంద్ర రెడ్డి గెలుపు కోరుతూ నంద్యాల వెళ్లిన విషయం తెలిసిందే.దీంతో అల్లు అర్జున్ చేసిన పర్యటనకి అనుమతి లేదని, పైగా ఎన్నికల కోడ్ ని కూడా ఉల్లంఘించాడని పోలీసులు కేసు నమోదు చెయ్యడం జరిగింది.గత కొన్ని రోజుల నుంచి ఈ కేసుపై ఏపి హైకోర్టులో ఇరు వైపుల మధ్య వాదనలు కూడా జరుగుతున్నాయి .
ఇప్పుడు ఆ కేసులో న్యాయస్థానం తన తీర్పుని ప్రకటించింది. అల్లు అర్జున్ చేసిన నంద్యాల పర్యటన వ్యక్తిగత పర్యటన కిందకి వస్తుందని, కాబట్టి ఎన్నికల కోడ్ కి సంబంధం లేదంటూ అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు చెప్పిన మాటలకి కోర్టు ఏకీభవించి కేసుని కొట్టి వేసింది.దీంతో అల్లు అర్జున్ కి ఇప్పుడు భారీ ఊరట లభించినట్టయింది. ప్రస్తుతం ఆయన పుష్ప పార్ట్ 2(pushpa 2)కి సంబంధించిన పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో శ్రీలీల(sreeleela)అల్లు అర్జున్ పై ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



