బన్నీ, కొరటాల.. ముహూర్తం ఫిక్స్?
on Mar 6, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చిత్రంతో బిజీగా ఉన్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 13న పాన్ - ఇండియా మూవీగా పలు భాషల్లో సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజయిన కొద్ది రోజులకే తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించబోతున్నారు బన్నీ.
ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ అల్లు అర్జున్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. జలకాలుష్యం నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ మూవీగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. కాగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకుళ్ళేందుకు బన్నీ, కొరటాల ప్లాన్ చేశారట. అంతేకాదు.. శరవేగంగా చిత్రీకరణ జరిపి 2022 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళిక రచించారని వినికిడి. త్వరలోనే బన్నీ, కొరటాల కాంబో మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా, కొరటాల తాజా చిత్రం `ఆచార్య` మే 13న థియేటర్స్ లో సందడి చేయనుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మల్టిస్టారర్ మూవీగా `ఆచార్య` తెరకెక్కుతోంది.
Also Read