షాకిస్తున్న బన్నీ రెమ్యూనరేషన్.. డబుల్ అయింది!!
on May 15, 2021
గత ఏడాది 'అల వైకుంఠపురములో'తో నాన్ బాహుబలి హిట్ కొట్టాడు అల్లు అర్జున్. బన్నీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం టాలీవుడ్ లో అనేక రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు తన సత్తాని ఇండియా వైడ్ గా చూపించాలి అనుకుంటున్నాడు బన్నీ. అందుకు తగ్గట్టే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా, విలన్ గా మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ‘పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా కోసం బన్నీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
‘పుష్ప' సినిమాకు బన్నీ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నిజానికి ‘పుష్ప'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మొదట భావించలేదు. చెప్పాల్సిన కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఇటీవలే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఈ మూవీ కోసం మొదట బన్నీ కేవలం రూ. 25 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా డీల్ చేసుకున్నాడట. అయితే ఇప్పుడు ‘పుష్ప'ను రెండు భాగాలుగా తీద్దామని నిర్ణయం తీసుకున్న వెంటనే బన్నీ రెమ్యూనరేషన్ డబుల్ అయిందట. రెండో పార్ట్ కోసం బన్నీ ఏకంగా రూ. 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. రెండు భాగాలకు గాను రూ. 70- 80 కోట్లు తీసుకుంటున్నాడని వినికిడి. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం బన్నీకి భారీ మొత్తం చెల్లించడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
Also Read