రూ.250 కోట్లకు 'ఆదిపురుష్' ఓటీటీ రైట్స్!
on Aug 3, 2022
'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు నిరాశపరిచినప్పటికీ.. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇండియాలో మరే హీరోకి సాధ్యం కాని విధంగా వరుస భారీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేస్తున్నాడు. అందులో 'ఆదిపురుష్' ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఏకంగా రూ.250 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్నాడు. టీ-సిరీస్ ఫిలిమ్స్ రూ.500 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఇంతవరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల కానప్పటికీ 'ఆదిపురుష్'పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. థియేటర్స్ లో విడుదలైన కొన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా, అన్ని భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.250 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి ఈజీగా మరో రూ.500 కోట్లు వచ్చే అవకాశముందని అంటున్నారు. అదే జరిగితే మేకర్స్ 200-300 కోట్ల ప్రాఫిట్స్ చూసే అవకాశముంది.
Also Read