మాజీ మంత్రికి షాక్.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరిన నటి
on Jul 24, 2021
తమిళనాడు మాజీమంత్రి మణికంఠన్ కు నటి చాందిని షాక్ ఇచ్చింది. మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు తాను చెన్నైలో ఉండి కోర్టు వ్యవహారాలు చూసుకోవాల్సి ఉండడంతో.. అందుకుగాను తనకు అయ్యే ఖర్చులు కూడా ఆయనే చెల్లించాలని పిటిషన్ లో కోరింది.
అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో సహజీవనం చేసి మోసం చేశాడని ఇటీవల చాందిని చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మణికంఠన్ ను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు చెన్నై హైకోర్టు విచారణలో ఉండగా.. చాందిని తాజాగా స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని.. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో.. అందుకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా ఆయనే చెల్లించాలని తాజా పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ ను వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.
'నోమాడ్స్' చిత్రంలో నటించిన చాందినికి ఓ ప్రైవేట్ ఈవెంట్ లో మణికంఠన్ తో పరిచయం ఏర్పడి అది సహజీవనానికి దారితీసింది. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో కాపురం చేసి.. ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. అంతేకాదు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తానని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసు కమీషనర్ కార్యాలయంలో చాందిని ఫిర్యాదు చేసింది.
Also Read