బ్రహ్మాజీ ‘బోటు' రివర్స్ ! ట్విట్టర్ నుంచి అవుట్!
on Oct 21, 2020
హైదరాబాద్ వరదలపై తెలుగు సినీ నటుడు సోషల్ మీడియాలో చేసిన ఓ సరదా పోస్ట్ ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఏకంగా ట్విట్టర్ అకౌంట్ నే క్లోజ్ చేసేలా చేసింది. నెటిజన్ల నుంచి వస్తోన్న విమర్శల ధాటిరి ఆ హీరో ట్విట్టర్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఆయన ఖాతా సెర్చ్ చేస్తే ఈ ఖాతా ఇప్పుడు యాక్టివ్ గా లేదని కనపడుతోంది.
హైదరాబాద్లోని వర్ష బీభత్స పరిస్థితులపై సినీనటుడు బ్రహ్మాజీ మూడు రోజుల క్రితం తనదైన
శైలిలో సరదాగా ట్వీట్ చేశారు. ‘ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. #HyderabadFloods అనే హ్యాష్ట్యాగ్ను ఆయన తగిలించాడు. ఆ ట్వీటే ఆయన కొంప ముంచింది. బ్రహ్మాజీ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. బ్రహ్మాజీకి సలహాలు ఇస్తూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేయగా.. మరికొందరు మాత్రం ఘాటుగా స్పందించారు.
కుండపోత వర్షాలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇటువంటి జోకులు వేయడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ నెటిజన్లు పోస్టులు చేశారు. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో ఉండి ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకకపోతుంటే బ్రహ్మాజీకి ఈ పరిస్థితులు నవ్వులాటగా ఉన్నాయా? అని మరికొందరు నిలదీశారు. ప్రజలు బాధపడుతుంటే ఇలాంటి ట్వీటా అంటూ ఇంకొందరు మండిపడ్డారు.
హైదరాబాద్ వరదలపై తాను చేసిన పోస్టుపై పెద్దే చర్చే జరగడం, తనను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు, కామెంట్లు చేయడంతో బ్రహ్మాజీ నిరాశకు గురయ్యారని, అందుకే ఆయన తన ట్విట్టర్ ఖాతాని ఆయన డియాక్టివేట్ చేసినట్లు చెబుతున్నారు. బ్రహ్మాజీ తాాజా ఘటనతో నెటిజన్లు ఇప్పుడు మరో రకంగా సెటైర్లు వేస్తున్నారు. బ్రహ్మాజీ ట్వీట్ బోటు రివర్సైందని కామెంట్లు చేస్తున్నారు.
Also Read