పండగపూట `ఆచార్య` తొలిపాట
on Mar 6, 2021
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విజనరీ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. చిరుకి జోడీగా `పంచదార బొమ్మ` కాజల్ అగ్వాల్ నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే దర్శనమివ్వనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం తరువాత మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ చిరు, మణిశర్మ నుంచి వస్తున్న చిత్రం కావడంతో `ఆచార్య` ఆల్బమ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మణి అద్భుతమైన ఆరు బాణీలను అందించారని టాక్. కాగా, `ఆచార్య` ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసిందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మహాశివరాత్రి పండగపూట `ఆచార్య` తొలి పాట రాబోతుందని తెలిసింది. కథానుసారం.. సినిమాలో మహాశివుడిపై సాగే ఓ మహత్తర గీతం ఉందట. ఆ పాటనే.. మహాశివరాత్రి రోజు `ఆచార్య` తొలిగీతంగా రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మే 13న `ఆచార్య` జనం ముందుకు రానుంది.
Also Read