'సిగ్గుండాలి మనకు! ఎంబీఏ ఫైనాన్స్ ఎందుకు?' అని 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంలో హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్తో హోస్ట్ సీట్లో కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అందుకో కారణం ఉంది. అదేమిటంటే... ఓ ప్రశ్నకు కంటెస్టెంట్కే కాదు, తారక్కు కూడా ఆన్సర్ తెలియలేదు.
అయితే, హాట్ సీటులో కూర్చున్న వ్యక్తి కుమార్తె కూడా ఆ షోకు వచ్చింది. ఆ చిన్నారికి ఆన్సర్ తెలిసింది. 'గుర్రం జాషువా' అని చెప్పింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. మనకి సిగ్గుండాలని చెప్పారు. చిన్నారి స్కూల్ టీచర్ రాజ్యలక్ష్మిగారిని కూడా తారక్ అభినందించారు. అయితే, ఆ ప్రశ్న ఏంటనేది తెలియడానికి షో చూడాలి.
తారక్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. 'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో తనకు క్లాసికల్ డాన్స్ నేర్పించినది సుధాకర్ అని, ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారని చెప్పారు. ఈమధ్య పెద్దగా కలవలేదని తెలిపారు.