మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. `ఆచార్య` చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవగా.. `గాడ్ ఫాదర్` సెట్స్ పై ఉంది. అలాగే `భోళా శంకర్` నవంబర్ నెలలో పట్టాలెక్కనుంది. అదే విధంగా.. బాబీ దర్శకత్వంలో చిరు చేయనున్న సినిమా కూడా త్వరలోనే షూటింగ్ బాట పట్టనుంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `MEGA 154` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న చిరంజీవి - బాబీ కాంబినేషన్ మూవీకి తాజాగా ముహూర్తం ఫిక్స్ అయిందట. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాలుకూ పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరుగనున్నాయని టాక్. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మెగా మాస్ ఎంటర్టైనర్ లో చిరంజీవి వింటేజ్ స్టైల్ లో మెస్మరైజ్ చేయనున్నారని సమాచారం. `ఖైదీ నంబర్ 150` తరువాత ఈ సినిమా కోసమే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. మెగాస్టార్ తో మరోమారు జట్టుకడుతుండడం విశేషం. ఇప్పటికే రెండు పాటలు కూడా రికార్డింగ్ జరుపుకున్నాయి. `వాల్టేర్ శీను` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. మరి.. రాబోయే చిత్రాలతో మెగాస్టార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.