క్లాస్ మూవీకైనా, ఊరమాస్ బొమ్మకైనా.. చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కి ట్యూన్స్ తో పెట్టిన విద్య. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా అన్య భాషల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడీ టాలెంటెడ్ కంపోజర్.
ఇదిలా ఉంటే.. 2022 క్యాలెండర్ ఇయర్ దేవి శ్రీ ప్రసాద్ కి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది రెండు సీక్వెల్ మూవీస్ తో పలకరించబోతున్నాడు డీఎస్పీ. ఆ చిత్రాలే.. `ఎఫ్ 3`, `పుష్ప - ద రూల్`. 2019 సంక్రాంతి విజేత `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3` ఈ సంవత్సరం వేసవిలో వినోదాలు పంచనుండగా.. 2021 హయ్యస్ట్ గ్రాసర్ `పుష్ప - ద రైజ్`కి సెకండ్ పార్ట్ గా రాబోతున్న `పుష్ప - ద రూల్` ఈ ఏడాది చివరలో ఎంటర్టైన్ చేయనుంది. మరి.. ఈ సీక్వెల్ మూవీస్ దేవి శ్రీ ప్రసాద్ కి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
Also Read: 'గుడుంబా శంకర్' హీరోయిన్ రి-ఎంట్రీ!
కాగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎఫ్ 3`లో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా కంటిన్యూ అవుతుండగా.. బ్రిలియంట్ కెప్టెన్ సుకుమార్ తీర్చిదిద్దుతున్న `పుష్ప - ద రూల్`లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా దర్శనమివ్వనున్నారు.