'ఆర్ఆర్ఆర్' బ్రాండ్తో ఓ రెస్టారెంట్ను ప్రారంభించడానికి టాలీవుడ్కు చెందిన ఓ పెద్ద నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ రెస్టారెంట్లో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ భాగస్వాములుగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చరణ్, తారక్లతో దీని విషయమై ఆ నిర్మాత సంప్రదించినట్లుగా కూడా సమాచారం.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే, 'ఆర్ఆర్ఆర్' థిమ్తో ఆ ముగ్గురూ ఓ రెస్టారెంట్ను ప్రారంభించవచ్చు. ఈ రెస్టారెంట్లో టాప్ చెఫ్లు పనిచేయనున్నారు. రుచికరమైన భారతీయ వంటకాలు అందించే ఈ రెస్టారెంట్లోని డెకరేషన్ అంతా 'ఆర్ఆర్ఆర్' ప్రధాన కథకు అనుగుణంగా ఉండనున్నది. 1920ల కాలం నాటి నేపథ్యంతో ఆ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ తర్వాత తారక్, చరణ్.. ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాలతో, తమ తదుపరి సినిమాల పనులతో బిజీ అయ్యారు. కాబట్టి, 'ఆర్ఆర్ఆర్' థీమ్ రెస్టారెంట్లో వారిద్దరూ పార్టనర్స్ అవుతారా, లేదా అనేది వెల్లడి కావాల్సి ఉంది.
రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆయన కెరీర్లో 'బాహుబలి 2' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1150 కోట్లను వసూలు చేయడమే కాకుండా, నెట్ఫ్లిక్స్లో అత్యధిక ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది.