మలయాళం, తెలుగు భాషల్లో ఇప్పటికే ఓటీటీలో నేరుగా విడుదలై విజయం సాధించిన చిత్రం 'దృశ్యం 2'. మలయాళంలో మోహన్లాల్, తెలుగులో వెంకటేశ్ నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్లో అజయ్ దేవ్గణ్ నటిస్తున్నాడు. తొలి సినిమా 'దృశ్యమ్' హిందీ రీమేక్లోనూ ఆయనే నటించాడు. అది హిట్టయింది. దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని హిందీ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సీక్వెల్ షూటింగ్ పూర్తయింది.
హైదరాబాద్లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా, ఆ సినిమాలో అజయ్ దేవ్గణ్ భార్యగా నటిస్తోన్న శ్రియ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించడమే కాకుండా, తన సహనటులు దేవ్గణ్, టబుతో కలిసున్న ఓ బిహైండ్-ద-సీన్స్ ఫొటోను షేర్ చేసింది. దానికి, "Thank you @andreikoscheev for beautiful flowers. Thank you for the best crew ever! @abhishekpathakk you are ammmaaaazzziiingggg director. So happy to have worked with you. @tabutiful you are gorgeous and beautiful inside out. Absolutely love you! @ajaydevgn thank you for being a fantastic actor. Pleasure working with you again. #Drishyam 2, Nandani shoot over for me, and I miss her…." అంటూ కాప్షన్ రాసుకొచ్చింది.
ఆ ఫొటోలో ఇషితా దత్తాతో కలిసి ఆమె కేక్ కట్ చేస్తోంది. 'దృశ్యమ్ 2'లో అజయ్ దేవ్గణ్ విజయ్గా నటిస్తే, అతని భార్య నందినిగా శ్రియ కనిపించనుంది. 'దృశ్యమ్' హిందీ రీమేక్ను తీసిన దర్శకుడు నిశికాంత్ కామత్ 2020లో ఆకస్మికంగా మృతి చెందగా, 'దృశ్యమ్ 2'ను అభిషేక్ కామత్ డైరెక్ట్ చేస్తున్నాడు. రజత్ కపూర్, టబు భార్యాభర్తలుగా కనిపించే ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా, మృణాల్ జాధవ్ కీలక పాత్రధారులు. వయాకామ్ 18 స్టూడియోస్, గుల్షన్ కుమార్, టి-సిరీస్, పనోరమా స్టూడియోస్ కలిసి నిర్మిస్తోన్న ఈ మూవీ ఈ ఏడాది నవంబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానున్నది.