కార్తీ టైటిల్ రోల్ పోషించగా లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన 'ఖైదీ' మూవీ తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా ఆ మూవీని లోకేశ్ రూపొందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అదే అతడికి విజయ్తో మాస్టర్ మూవీ చాన్స్నిచ్చింది. 2020 మొదట్లో 'ఖైదీ'ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అజయ్ దేవ్గణ్ ప్రకటించాడు. "యస్, తమిళ ఫిల్మ్ 'ఖైదీ' హిందీ రీమేక్ను చేస్తున్నాను. 2021 ఫిబ్రవరి 12న రిలీజవుతుంది" అని అప్పుడాయన ట్వీట్ చేశాడు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అప్పుడు షూటింగ్ మొదలుపెట్టలేదు. ఇప్పుడు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also read: హిందీ 'పుష్ప'కు ఎదురే లేదు.. రూ. 80 కోట్ల మార్కు దాటాడు!
ధర్మేంద్ర శర్మ డైరెక్ట్ చేస్తున్న హిందీ రీమేక్కు 'భోలా' అనే టైటిల్ ఖరారు చేశారు. అసీమ్ బజాజ్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాడు. జనవరి 11న షూటింగ్ ప్రారంభించారు. కొవిడ్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని తక్కువమంది యూనిట్తో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అజయ్ దేవ్గణ్ స్వయంగా ప్రి-ప్రొడక్షన్ వర్క్ను పర్యవేక్షించాడు.
Also read: 'విక్రమ్ వేద'లో వేద ఫస్ట్ లుక్ ఇదే!
పెరోల్పై జైలు నుంచి విడుదలైన ఒక ఖైదీ తన కూతుర్ని కలుసుకోవడానికి చేసే జర్నీ, ఆ సందర్భంగా ఎదుర్కొనే విపత్కర పరిస్థితులతో యాక్షన్ థ్రిల్లర్గా 2019లో విడుదలైన 'ఖైదీ' ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఆ సినిమా చూడగానే అజయ్ దేవ్గణ్కు నచ్చేసి, హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.