ఆయనొచ్చాకే ట్రెండ్ మారిపోయింది...రైటర్స్ ఒకటి రాస్తే వాళ్ళు వేరేలా పాడుతున్నారు
on Nov 24, 2022
ప్లేబ్యాక్ సింగర్గా శ్రీలేఖ ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు .. సొంతంగా ట్యూన్స్ కంపోజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలకు పనిచేశారు శ్రీలేఖ. "ప్రేయసి రావే, ప్రేమించు, ఆపరేషన్ దుర్యోధన" ఇలా చాలా చిత్రాలకు ఆమె పని చేశారు. చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకురాలిగా మంచి పేరు సంపాదించిన శ్రీలేఖ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో సిద్ శ్రీరామ్ సాంగ్స్ పాడేటప్పుడు ఎలాంటి ఉచ్చారణ దోషాలు వస్తాయి..అనే అంశానికి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. " హైపిచ్ లో సాంగ్ పాడేటప్పుడు సున్నా పలకడం చాలా కష్టం..నేను రైటర్స్ కి కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తాను సున్నాలు పెట్టొద్దు అని. సున్నాలు పెడితే ఎలాంటి సింగర్ ఐనా సరే పాడడం కష్టం..పాడేటప్పుడు ఆ సున్నా సౌండ్ వేరేలా మారిపోతుంది. రెహ్మాన్ వచ్చాక కొత్త సింగర్స్ రావడం, కొత్త ఒరవడి, పదం పదంలా పలకకపోవడం అది ట్రెండ్ ఐపోయింది. ఆయన వచ్చాక పాట పాడడం తగ్గిపోయింది మ్యూజిక్ ఎక్కువైపోయింది.
ఎందుకు అంటే ఆయనకు బేసిగ్గా తెలుగు రాదు. తమిళ్ ఇండస్ట్రీలో ఇలా అపశబ్దాలు పలికే పద్దతి లేదు ఎందుకంటే భాష తెలిసినప్పుడు పాడితే తప్పులు రావు. హిందీ వాళ్ళు తెలుగులో పాడితే తప్పులు వస్తాయి. సిద్ శ్రీరామ్ పాడేటప్పుడు ఆయన ఉచ్చారణ దోషాల్ని గుర్తించి చెప్పేవాళ్ళు లేక అదే కరెక్ట్ అనుకుని ఆయన పడేస్తున్నాడు. అది ఆయన తప్పు కాదు. ఆయన అమెరికాలో పుట్టి పెరిగాడు. సాంగ్స్ పాడించుకునేవాళ్ళు సింగర్ దగ్గర ఉండి ఆ పదాలకు అర్దాలు చెప్పి పాడించుకోవాలి. ఇంకో విషయం చెప్పాలి అంటే "చూడాలని ఉంది" లో రైటర్ ఒక సాంగ్ ని "రామచిలకమ్మ" ని రాస్తే అది కాస్త ఉదిత్ నారాయణ్ గారు పాడేటప్పుడు " రామ్మా..చిలకమ్మా" అని పడేసారు. ఆ పదం అక్కడ సెట్ అయ్యింది అలాగే హిట్ అయ్యింది కాబట్టి సరిపోయింది లేదంటే ఆడియన్స్ లోకి వెళ్లేసరికి అర్ధమే మారిపోయేది. భాషాభిమానులు బాధపడేవారు " అని శ్రీలేఖ అన్నారు.
Also Read