ఓటీటీ రంగంలోకి రామోజీ రావు!!
on Jun 22, 2021
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా పుణ్యమా అని ప్రేక్షకులు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కు అలవాడుపడిపోయారు. దీంతో ఎందరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో ఓటీటీ రాబోతుందని తెలుస్తోంది. త్వరలో ఈటీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతోందని సమాచారం. రాబోయే రోజుల్లో ఓటీటీ కంటెంట్ రాజ్యమేలుతుందని భావించిన ఈటీవీ సంస్థ యజమాని రామోజీ రావు.. ఓటీటీ రంగంలోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భారీ స్థాయిలో ఓటీటీను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈటీవీ వద్ద ఇప్పటికే వందల కొద్దీ సినిమాలున్నాయి. అలానే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలన్నింటినీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ఒరిజినల్ కంటెంట్ కోసం చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
టీవీ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈటీవీ.. ఓటీటీ రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి.