పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ!!
on Jun 12, 2021
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. మొదటి రెండు సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది' విజయం సాధించగా.. ఎన్నో అంచనాలతో విడుదలైన మూడో సినిమా 'అజ్ఞాతవాసి' మాత్రం నిరాశ పరిచింది. అయినప్పటికీ వీరి కాంబినేషన్ లో మరో మూవీ రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో త్వరలో ఒక మూవీ రాబోతుందని టాక్ వినిపిస్తోంది.
పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహరి వీరమల్లు', సాగర్ చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోశియం' రీమేక్ చేస్తున్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో ఒక మూవీని చేయనున్నారు. ఆ తరువాత పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని అంటున్నారు. ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం.