మిథాలీ రాజ్ బయోపిక్ డైరెక్టర్ చేంజ్!!
on Jun 22, 2021
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు' పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ బయోపిక్ లో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన సంఘటనలను, క్రికెట్ కెరీర్ లో ఆమె సాధించిన ఘనతలను చూపించనున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు.. అయితే కరోనా ప్రభావం మరియు తాప్సీ ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా ఇది ఆలస్యమైంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ బయోపిక్ కి డైరెక్టర్ మరనున్నాడని టాక్ వినిపిస్తోంది.
'శభాష్ మిథు' మూవీ డైరెక్టర్ ను చేంజ్ చేస్తున్నారట. మొదట రాహుల్ ధోలాకియా ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ పేరు వినిపిస్తోంది. శ్రీజిత్ ఈ బయోపిక్ కి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అయితే డైరెక్టర్ ను చేంజ్ చేయడానికి కారణమేంటో తెలియరాలేదు.
ఇప్పటికే 'రష్మి రాకెట్' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించి అలరించడానికి సిద్ధమైన తాప్సీ.. 'శభాష్ మిథు'లో మిథాలీ రాజ్ పాత్రలో ఎలా ఒదిగిపోతుందో చూడాలి. కాగా, ఈ పాత్రలో నటించడానికి తాప్సి క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుంది.
Also Read