English | Telugu

"న‌న్ను చాలా మంది తిడుతున్నారు".. వాపోయిన డాక్ట‌ర్ బాబు!

బుల్లితెరపై హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు 'కార్తీకదీపం' డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో పాటు 'హిట్లర్ గారి పెళ్లాం' అనే మరో సీరియల్ కూడా చేస్తున్నారు. అయితే నిరుపమ్ ఎక్కడికి వెళ్లినా.. 'కార్తీకదీపం' సీరియల్ గురించే అడుగుతుంటారట. వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మోనిత ప్రెగ్నెంట్ న్యూస్ తో మరింత ఆసక్తికరంగా మారింది.

దీప, కార్తిక్ లు కలుస్తారనుకునే సమయంలో మోనిత ఇచ్చిన ట్విస్ట్ తో సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నెటిజన్లు ఈ సీరియల్ కు ముగింపు ఉండదా..? దీప, కార్తిక్ లు ఎప్పుడు కలుస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై చాలా మంది తనను తిడుతున్నారని.. పర్సనల్ మెసేజ్ లు కూడా పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.

ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కార్తీకదీపం' సీరియల్ గురించి మాట్లాడారు. ఈ సీరియల్ ఇంత క్లిక్ అవుతుందనుకోలేదని అన్నారు. వంటలక్క క్యారెక్టర్ విన్నప్పుడు సక్సెస్ ఫార్ములా కాబట్టి నమ్మకం ఏర్పడిందని.. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదని చెప్పారు. మీమ్స్, ట్రోల్స్ చూసినప్పుడు నవ్వుకుంటానని.. తిట్టినప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటానని అన్నారు. తనకు పర్సనల్ గానే చాలా మంది మెసేజ్‌లు పెట్టి తిడుతుంటారని... ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోనని అన్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...