English | Telugu

చేసింది ఒకే సీన్‌.. దాన్నీ లేపేశారు.. పాపం శ్రీ‌ప్రియ‌!

బుల్లితెర సీరియళ్ల ద్వారా తనకంటూ తెలుగు ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న మన తెలుగు అమ్మాయిలలో శ్రీప్రియ ఒకరు. ఆమె ఫస్ట్ టార్గెట్ సీరియళ్లు కాదు, సినిమాలు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. సినిమాల్లోకి వస్తానని దర్శకుడు బోయపాటి శ్రీనును కలిసి చెప్పింది. ఆయన వద్దని సలహా ఇచ్చారట. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించేసరికి 'సరే... ప్రత్నించు' అని చెప్పారట.

ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారమయ్యే 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో మానసి పాత్రలో శ్రీప్రియ నటిస్తోంది. అంతకు ముందు 'అగ్నిసాక్షి' సీరియల్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, శ్రీప్రియ ఫస్ట్ టైమ్ కెమెరా ఫేస్ చేసింది దేనికోసమో తెలుసా? 'సుకుమారుడు' సినిమా సెట్స్ లో. ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'సుకుమారుడు' సినిమాలో శ్రీప్రియ నటించింది. నటించింది అనడం కంటే తళుక్కున మెరిసింది అనడం బావుంటుంది ఏమో. ఎందుకంటే... అందులో ఒకే ఒక్క సన్నివేశంలో శ్రీప్రియ నటించింది. ఆ ఒక్క సీన్‌నూ ఎడిటింగ్ లో లేపేశారు. ఒక్క చోట తళుక్కున కనిపించింది.

సాయికుమార్ హోస్ట్ చేస్తున్న 'వావ్' షోకి వచ్చిన శ్రీప్రియ ఈ సంగతి చెప్పింది. 'సుకుమారుడు'లో హీరో ఆది, సాయికుమార్ తనయుడు కదా! అందుకని, ఆయనతో ఈ విషయం షేర్ చేసుకుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...