English | Telugu

కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ఆటో డ్రైవర్స్...ఆటో డ్రైవర్ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అంతా కూడా ఆటో డ్రైవర్ థీమ్ తో రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ కి యాంకర్ రవి వచ్చాడు. ఐతే రవిని చూసిన నూకరాజు "ఏ మీటర్ లేకుండా నువ్వు రావు కదా" అనేసరికి "ఆటో డ్రైవర్ లు పడే కష్టాలను ఆడియన్స్ కి చూపించడం కోసం నేను వచ్చాను" అని చెప్పాడు రవి. అంటే ఎపిసోడ్ మొత్తం కూడా ఆటో డ్రైవర్ ల కష్టాలు, డాన్స్, పెర్ఫార్మెన్స్, స్కిట్స్ , సింగింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఇదే థీమ్ మీద జరిగింది. ఐతే తాగుబోతు రమేష్, పంచ్ ప్రసాద్ వచ్చి ఆటో మీద జోక్స్ వేశారు. "నా ఆటో మీద మంచి కొటేషన్స్ రాసినా ఎవరూ ఎక్కడం లేదు" అని తాగుబోతు రమేష్ అనడంతో..ఇంతకు ఎం రాసావు అని ప్రసాద్ అడిగాడు. "లోకంలో లేవు కాకులు...నా ఆటోకు లేవు బ్రేకులు" అని రాసినట్లు చెప్పాడు. బ్రేకులు లేని ఆటోలో ఎలా ఎక్కుతారు అంటూ ప్రసాద్ కౌంటర్ వేసాడు. ఇక ఈ షోకి రియల్ లైఫ్ లోని కొంతమంది లేడీ ఆటో డ్రైవర్స్ వచ్చారు.

"మా ఆయన చనిపోయి 18 ఏళ్ళు అయ్యింది. నేను అప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నా" అంటూ ఒకావిడా చెప్పారు. " నేను 2014 నుంచి ఆటో వేయడం స్టార్ట్ చేసాను..నువ్వు ఛస్తే చావు కానీ మా డబ్బులు ఇవ్వండి " అంటారంటూ ఇంకొకావిడ చెప్పుకొచ్చారు. ఇంకో కుర్రాడైతే "మార్నింగ్ డిగ్రీ చదువుకుంటూ సాయంత్రం ఆటో నడుపుకుంటున్నా" అని చెప్పాడు. తర్వాత ఆదర్శ్ వచ్చి ఆటో డ్రైవర్ గా డాన్స్ చేసాడు. అలాగే ఇంకో ఇద్దరు లేడీ డాన్సర్స్ వచ్చి ఆటో డ్రైవర్ గెటప్స్ లో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు.ఇక ఈ ప్రోమోలో ధరణి ప్రియా విమెన్ సెల్ఫ్ డిఫెన్సె యాక్ట్ చేసి చూపించింది. అలాగే తన చంకలో ఒక బిడ్డతో వచ్చి కత్తి తీసుకుని దుండగుల మీద ఎలా అటాక్ చేయాలి అనేది చేసి చూపించింది. ఫైనల్ గా కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాష్టర్ వచ్చి రియల్ లైఫ్ ఆటో డ్రైవర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో చేసి చూపించాడు. ఒక ఆటో డ్రైవర్ కి లైఫ్ లో కష్టాలు ఎలా ఉంటాయి అనేది చేసాడు. అంటే అప్పులు, వడ్డీలు, స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్, ఇంట్లో తినడానికి ఇవన్నీ కూడా చేసి చూపించాడు. "నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను...నేనొక ఆటో డ్రైవర్ కొడుకుని అని" అంటూ చెప్పుకొచ్చాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.