బాలీవుడ్ మాఫియా నన్ను చంపాలని చూస్తోంది.. నాకు సాయం చేయండి!
బాలీవుడ్ నటి, 'వీరభద్ర'లో బాలకృష్ణ జోడీగా నటించిన తనుశ్రీ దత్తా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. తనను బాలీవుడ్ మాఫియా, జాతి వ్యతిరేక నేరగాళ్లు కలిసి తనను దారుణంగా వేధిస్తున్నారనీ, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనీ ఆమె ఆ పోస్ట్లో ఆరోపించారు. తాను చావు నుంచి ఎలాగో తప్పించుకున్నానని ఆమె తెలిపారు. "నన్ను చాలా దారుణంగా వేధిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా ఏదైనా చేయండి!!" అని ఆమె అర్థించారు.