జగతి సంతాప సభలో ఎండీ పదవిని రిజెక్ట్ చేసిన మహేంద్ర!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -888 లో.. రిషి మాట్లాడిన మాటల గురించి శైలేంద్ర, దేవయాని ఇద్దరు భయపడతారు. తన తల్లి చావుకి కారణం మనమే అని తెలిస్తే రిషి మనల్ని వదిలిపెట్టడని దేవయాని అంటుంది. మనకి సంబంధించిన చిన్న క్లూ దొరికినా ఆ వసుధారా మనల్ని రిషి ముందు దోషులుగా నిలబెడుతుందని అంటుంది. అవన్నీ ఆలోచించకు, నేను చేయాలిసింది నేను చేస్తానని దేవయానితో శైలేంద్ర అంటాడు.