English | Telugu
సుప్రీమ్ కోర్టులో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
స్టాక్ మార్కెట్ నేలచూపులు మొదలెట్టింది. 2,600 పాయింట్ల నష్టంతో ఈ రోజు ట్రేడింగ్ మొదలైంది. పలు దేశాల్లో లాక్ డౌన్ తో వృద్ధి తగ్గే ప్రమాదం. 8 శాతానికి మించి పడిపోయిన సెన్సెక్స్. నిఫ్టీ-50లో అన్ని కంపెనీలూ నష్టాల్లోనే. కరోనా వైరస్ భయాలు స్టాక్ మార్కెట్ ను ఇంకా వీడలేదు. పలు దేశాల్లో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి ప్రభావితం అవుతుందంటూ వచ్చిన విశ్లేషణలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. ఇదే సమయంలో శుక్రవారం నాటి యూఎస్ మార్కెట్ సరళి, నేటి ఆసియా మార్కెట్ల నష్టాలు కూడా ప్రభావం చూపడంతో, ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది.రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని రైతులు హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. " బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో గడగడలాడుతోంది. మన దేశంలో 2వ దశలో ఉంది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్ల వద్దనే ఉండాలని, ఏదైనా అత్యవసరమైతేనే బయటకు రావాలని...
కరోనా దెబ్బకు రాకెట్ సైతం కుదేలైంది . రాకెట్ ప్రయోగాలను ఈ నెల 31 వరకూ సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం స్తంభింప చేసింది. కోవిడ్- 19 వ్యాప్తి నివారణ కోసం ఈ నెల 31 వరకూ షార్ను షట్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు
ఇదెక్కడో సూపర్ మార్కెట్లలో అనుకుంటే పొరపాటే. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో ధరలు చుక్కలని తాకాయి... నిత్యావసరాలు, పాలు, కూరగాయల ను జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించినప్పటికీ, ఆ విషయం మీద నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ మాట్లాడుతూ-నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ -గుడిమల్కాపూర్ మార్కెట్ లో వినియోగదారులను వ్యాపారులు దాదాపుగా దోచేశారు.
ఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు . అమరావతి లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ప్రజా రవాణా నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
అత్యవసర సేవలు మినహా, తెలంగాణ అన్ని సేవలు బంద్! కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు అలాగే మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు.......
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతిమనిషికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యం, 1500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు....
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీడియ కాన్ఫరెన్స్ లు చూశారుగా. తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ ఎంత వేగంగా, వడగళ్ల వాన లాగా గడ గడా తాను చెప్పాల్సింది చెప్పేసి, ప్రజలను అప్రమత్తం చేసిన తీరు అందరి ప్రశంసలూ అందుకుంది.
కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ఆదివారంనాడు తెలంగాణలో 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని...
ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన లేనట్టే. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన 75 జిల్లాల్లో , విశాఖపట్నం కూడా ఉన్నందువల్ల, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే . ఇహ, ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి ఆ ఆలోచన గురించి భయపడాల్సిన అవసరం లేదన్నమాట.
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో , తెలంగాణా లోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో ఈ నెలాఖరు వరకూ కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది.
కేశినేని నాని... ఫైర్ బ్రాండ్ టీ డీ పీ ఎం.పి . జనాలకు అసలు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని నాయకుడు. ఏ ఒక్క చిన్న వకాశం వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దులిపి ఆరేయటానికి అసలేమాత్రం వెనుకాడడు. వైరస్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేరళ సీఎం పినరయి విజయన్ను చూసి నేర్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , ఆయన ట్విటర్ ద్వారా సూచించారు.