Read more!

English | Telugu

సంక్రాంతి బరిలో కుర్ర హీరో.. మామూలు ధైర్యం కాదు!

2023 సంక్రాంతి పోరులో 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీర సింహా రెడ్డి'తో బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అలాగే తమిళ్ డబ్బింగ్ సినిమాలు 'వారిసు', 'తునివు' వస్తున్నాయి. నిజానికి 'ఆదిపురుష్', 'ఏజెంట్' కూడా సంక్రాంతికే రావాలనుకున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి. అయినప్పటికీ చిరు, బాలయ్య పోరుతో పాటు.. తమిళ స్టార్ల చిత్రాలతో పొంగల్ వార్ రసవత్తరంగానే ఉండనుంది. అయితే ఇప్పుడు ఈ స్టార్ల బాక్సాఫీస్ వార్ లోకి ఓ కుర్ర హీరో ఎంటర్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.

కొంతకాలంగా వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇటీవల 'లైక్ షేర్ & సబ్ స్క్రైబ్'తో పలకరించిన ఈ కుర్ర హీరో చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమా కూడా ఉంది. నూతన దర్శకుడు అనిల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'కళ్యాణం కమనీయం' అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఊహించని విధంగా సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని న్యూస్ వినిపిస్తోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'ఆదిపురుష్'ని విడుదల చేయాలనుకుంది యూవీ. 'ఆదిపురుష్' కోసం బ్లాక్ చేసిన కొన్ని థియేటర్స్ లో ఇప్పుడు సంతోష్ శోభన్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్.