Read more!

English | Telugu

మహానటి.. అప్పుడు సావిత్రి, ఇప్పుడు సమంత!

మహానటి అనగానే మనకు గుర్తొచ్చే పేరు సావిత్రి. ఎన్ని తరాలైనా మహానటిగా ప్రేక్షకుల హృదయాల్లో ఆమె పేరు నిలిచిపోతుంది. ఇక ఈ తరంలో మహానటి అనిపించుకునే అర్హత ఎవరికి ఉందనే ప్రశ్న తలెత్తితే.. 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్ర పోషించి మెప్పించిన కీర్తి సురేష్ పేరును కొందరు ప్రస్తావిస్తారు. అయితే సీనియర్ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ మాత్రం ఈ తరం మహానటి సమంత అంటున్నారు.

ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' సీజన్-2 కి సురేష్ బాబు, అల్లు అరవింద్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య "ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో మహానటి ఎవరు?" అని అడగగా.. సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇద్దరూ అనుకోకుండా 'సమంత' పేరునే చెప్పారు. "ప్రస్తుతం ఉన్నవాళ్లలో మహానటి అవగలిగితే సమంత మాత్రమే అవగలదు" అని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ని సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.