English | Telugu

సాదాసీదాగా "సాహసం" !!

ఒకటిన్నర సంవత్సరం అనంతరం గోపీచంద్ సినిమా విడుదలవుతోంది. అయినా సరే, ఎందుకోగానీ ఆ చిత్రానికి మినిమమ్ క్రేజ్ కూడా లేకుండాపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ చిత్రం "సాహసం". గోపీచంద్ ప్రీవియస్ మూవీస్ "వాంటెడ్, మొగుడు" చిత్రాలు అట్టర్‌ ఫ్లాపవ్వడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ.. పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉండడంపై కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు చిత్ర పరిశీలకులు.

"సాహసం"లో జంటగా నటిస్తున్న గోపీచంద్_తాప్సీ ఇంతకుముందు "మొగుడు"లో నటించారు. అలాగే "సాహసం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న "చంద్రశేఖర్ ఏలేటి" ఇంతకుమునుపు గోపీచంద్‌తో "ఒక్కడున్నాడు" చిత్రం తీసారు. ఈ రెండు చిత్రాలు (మొగుడు, ఒక్కడున్నాడు) బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లాపడ్డాయి.

ఇకపోతే "సాహసం" చిత్రం నిర్మిస్తున్న బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఇంతకుముందు "దేవుడు చేసిన మనుషులు_ఒంగోలు గిత్త" వంటి "కళాఖండాలు" నిర్మించి ఉన్నారు. ఈ కారణాలన్నిటివల్ల.. "సాహసం" చిత్రం ఈనెల 12న అత్యంత సాదాసీదాగా విడుదలవుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న "సాహసం" రేపు విడుదలయ్యాక అద్భుతాలేమైనా చేస్తుందేమో చూడాల్సిందే!