Read more!

English | Telugu

రామ్ చరణ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది

శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC 15' తర్వాత రామ్ చరణ్ చేయబోయే తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చింది. చరణ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేయడం ఖరారైందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. "కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది" అంటూ ఈరోజు ఉదయం ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ పాన్ ఇండియా మూవీ రూపొందనుందని తెలుస్తోంది. జనవరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశముంది.