Read more!

English | Telugu

'హిట్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకధీరుడు

'మేజర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అడివి శేష్ నటించిన చిత్రం 'హిట్-2'(హిట్: ది సెకండ్ కేస్). 2020 లో విడుదలై మంచి విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి ఈ చిత్రం సీక్వెల్ గా వస్తోంది. శైలేశ్ కొల‌ను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శకధీరుడు రాజమౌళిని రంగంలోకి దింపుతున్నారు.

'హిట్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సోమవారం(నవంబర్ 28) సాయంత్రం నిర్వహించబోతున్నట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనున్న ఈ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 

నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.