Read more!

English | Telugu

ఇండియాలో 'అవతార్-2' రికార్డుల వేట మొదలైంది

'అవతార్-2' రికార్డుల వేట అప్పుడే మొదలైంది. మన దేశంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచుస్తున్నారో అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చెప్పొచ్చు. విడుదలకు కొన్ని వారల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

వెండితెరపై 'అవతార్' అనే మాయాజాలాన్ని సృష్టించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 2009లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. 'అవతార్' సృష్టించిన కలెక్షన్ల రికార్డులను ఇప్పటికీ ఏ సినిమా టచ్ చేయలేకపోయింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' పేరుతో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న విడుదల కానుంది.

ఇండియాలోనూ 'అవతార్' కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు 'అవతార్-2' కోసం కూడా ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియాలో ప్రీమియం ఫార్మాట్ లలో 45 స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. మూడు రోజుల్లోనే 15 వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. మూడు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం సంచలనంగా మారింది.